May 3, 2013

రేపు ఎన్టీఆర్ జాతీయ లిట్రసీ అవార్డు ప్రకటన

హైదరాబాద్ : ఎన్టీఆర్ జాతీయ లిట్రసీ అవార్డును శనివారంనాడు ప్రకటించనున్నట్లు ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి వెల్లడించారు. ఈ ఏడాది ఒరియా భాషకు సంబంధించి ఈ అవార్డును ప్రకటిస్తున్నామని చెప్పారు. అవార్డుకు సంబంధించిన జ్యూరీ శనివారంనాడు సమావేశమై అవార్డు గ్రహీతను నిర్ణయిస్తుందని, అనంతరం ఏర్పాటు చేయనున్న విలేఖరుల సమావేశంలో ప్రకటిస్తుందని వెల్లడించారు.