May 2, 2013

బాబును కలిసిన కడియం!

హైదరాబాద్
: మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి గురువారం అధినేత చంద్రబాబును కలిశారు. ఆయన నివాసానికి వెళ్ళి సుమారు అరగంటపాటు భేటీ అయినట్లు సమాచారం. కడియం కొంతకాలంగా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా లేరు. విశాఖ సభకు కూడా వెళ్లలేదు. దీంతో ఆయన పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ నేతలు కూడా ఆయనను కలిసి మాట్లాడారు. కానీ ఈ ప్రచారానికి భిన్నంగా ఆయన చంద్రబాబు నివాసానికి వెళ్లారు. పార్టీ వ్యవహారాలపైనే మాట్లాడినట్లు ముక్తసరిగా చెప్పారు.