May 3, 2013

27,28 తేదీల్లో గండిపేటలో మహానాడు

హైదరాబాద్: ఈ నెల 27, 28 తేదీల్లో హైదరాబాద్(గండిపేట)లో మహానాడు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ మహాసభలకు రాష్ట్రం నలుమూలల నుంచి పది వేల మంది ప్రతినిధులను ఆహ్వానించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. సుదీర్ఘ పాదయాత్ర అనంతరం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.

పాదయాత్ర విజయవంతమైన నేపథ్యంలో పార్టీ అభిమానులు, కార్యకర్తలకు చంద్రబాబు కృతఙ్ఞతలు తెలిపారు. డాక్టర్ల సలహా మేరకు పూర్తి విశ్రాంతి తీసుకున్న అనంతరం పాదయాత్ర చేయని ఆరు జిల్లాల్లో బస్సు యాత్ర చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇక ఎన్నికల సంవత్సరం మొత్తం ప్రజల్లోనే ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. బస్సు యాత్ర అనంతరం పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళేలా కార్యక్రమాల రూపకల్పన చేయాలని సమావేశంలో నిర్ణయం జరిగింది.