April 20, 2013

సీఎం కిరణ్‌కు కలిసిన టి.టీడీపీ నేతలు

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో తెలంగాణ టీడీపీ నేతలు శనివారం ఉదయం భేటీ అయ్యారు. బయ్యారం గనుల జీవోను వెనక్కు తీసుకోవాలని నేతలు వినతి చేశారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీకి డిమాండ్ చేశామని,

దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. బయ్యారం గనుల నుంచి ఒక్క తట్ట ఖనిజాన్ని తరలించినా సహించేది లేదని హెచ్చరించారు. బయ్యారంపై కేసీఆర్ ఎందుకు మాట్లాడకుండా ఉన్నారని టీ.టీడీపీ నేతలు ప్రశ్నించారు.