October 21, 2012

వైఎస్సార్‌సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయమని షర్మిల బైబిల్‌పై ప్రమాణం చేసి చెప్పగలరా..? -సీతక్క సవాల్

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకోడానికే మరో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్‌లో వైఎస్సార్‌సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయమని షర్మిల బైబిల్‌పై ప్రమాణం చేసి చెప్పగలరా అని సీతక్క సవాల్ విసిరారు.

తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన వైఖరి ఇప్పటికే చెప్పారని, 2008లోనే తాము తెలంగాణకు అనుకూలమని లేఖ రాసిన విషయాన్ని సీతక్క ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణపై స్పష్టతతో ఉన్న చంద్రబాబు పాదయాత్రను అడ్డుకోవడం సరికాదన్నారు. బాబు పాదయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోందని ఆమె చెప్పారు.
No comments :

No comments :