October 21, 2012

అదివారం పాదయాత్రలో చంద్రబాబు వెంట లోకెష్ ...22.10.2012

 చంద్రబాబు నాయుడు పాదయాత్రలో ఆదివారం కూడా ఆయన కుమారుడు లోకేష్ పాల్గొన్నారు. గూడూరు మండలంలోని జూలకల్ గ్రామం నుంచి బాబు వెంటే నడిచారు. జూలకల్, గూడూరు గ్రామాల్లో చంద్రబాబు ప్రసంగాన్ని లోకేష్ శ్రద్ధగా విన్నారు. అలాగే లోకేష్‌తో పాటు చంద్రబాబు సోదరి కుమారుడు కె. ఉదయ్ కుమార్, మేనల్లుడు ఏ.కోదండరామనాయుడు పాదయాత్రలో పాల్గొన్నారు.

కాగా, రాష్ట్రంలో టీడీపీకి చెందిన యువత నిస్తేజంగా మారిందని, యువకుల చైతన్యానికి లోకేష్ నడుంబిగించాలని తెలుగుయువత ఉపాధ్యక్షుడు వై.నాగేశ్వరయాదవ్ ఆయనకు వినతిపత్రం సమర్పించారు. యువకులను చైతన్యం చేసే భూమికను లోకేష్ చేపట్టి 2014 ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు.
No comments :

No comments :