October 20, 2012

మహబూబ్ నగర్ జిల్లా రాజోలిలో ‘వస్తున్నా మీకోసం’ ఏర్పాట్ల పరిశీలన

  • - ఈనెల 22న జిల్లాకు చంద్రబాబు పాదయాత్ర
  • - మొదటి సభ రాజోళిలో
  • - ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర నాయకులు

టీడీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘వస్తున్నా మీకోసం’ పేర నిర్వహిస్తున్న పాదయాత్ర ఏర్పాట్లను ఆ పార్టీ రాష్ట్ర నాయకులు శుక్రవారం పరిశీలించారు. ఎమ్మెల్యేలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే రాములు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎర్రశేఖర్, మాజీమంత్రులు పెద్దిరెడ్డి, కడియం శ్రీహరి, సీనియర్ నాయకురాలు వావిలాల సునీత రాజోలి గ్రామాన్ని పరిశీలించారు. సుంకేసుల బ్యారేజీ మీదుగా పాదయాత్ర ఉండటంచేత బ్యారేజీపై, రాజోలిలో సభ కోసం ఎంపిక చేసిన స్థలాన్ని కూడా పరిశీలించారు. అనంతరం గ్రామంలో పాదయాత్ర ఏఏ వీధులగుండా వెళ్ళాలి అనే విషయాలపై చర్చించారు. ఈ నెల 22న ఉదయం చంద్రబాబు రాజోలి గ్రామంలోకి ప్రవేశిస్తారన్నారు. గతంలో అనుకున్న విధంగా 21 రాత్రి రాజోలిలో బసచేసే కార్యక్రమం రద్దయిందని వారు తెలిపారు. తెలంగాణవాదానికి టీడీపీ వ్యతిరేకంకాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు చంద్రశేఖర్ గౌడు, బీసీసెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. గజేంద్రగౌడు, బీసీ సెల్ మండల అధ్యక్షులు జి రాజోలి కిష్టన్న, వెంకటస్వామి, విజయ్, ఉసేన్ పాల్గొన్నారు.
No comments :

No comments :