September 9, 2013

చంద్రబాబు యాత్రను ప్రజలు ఆదరిస్తున్నారు : గద్దె రామ్మోహన్

తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు బస్ యాత్రను ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని టిడిపి లోక్ సభ మాజీ సభ్యుడు గద్దె రామ్మోహన్ అన్నారు.గ్రామాలలో జనం చంద్రబాబుకు నీరాజనం పడుతున్నారని, మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆయన చెప్పే విషయాలను విని అర్ధం చేసుకుంటున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయడానికే ఈ కుట్ర జరుగుతోందన్న విషయాన్ని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారని ఆయన అన్నారు.