May 13, 2013

గవర్నర్‌ కలిసిన చంద్రబాబు

హైదరాబాద్‌ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను నరసింహన్‌కు కలిసారు. కళంకిత మంత్రులను బర్తరఫ్‌ చేయాలంటూ బాబు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయనతోపాటు టీడీపీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. తీవ్రవాదం సమస్యకన్నా ప్రమాదకరమైనది అవినీతి అని బాబు అన్నారు. ధర్మాన రాజీనామా చేసినా సీఎం ఆమోదించలేదన్నారు. అవినీతి జరిగిన విషయం తెలిసినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు.