May 24, 2013
మహానాడుకు భారీ ఏర్పాట్లు
ఈ నెల 27 నుంచి మొయినాబాద్ మండలం హిమాయత్నగర్ గ్రామంలోని తెలుగు విజయంలో జరగనున్న టీడీపీ మహానాడుకు పార్టీ నేతలు ఇప్పటి నుంచే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా ప్రవేశమార్గం టిప్పుఖాన్ వంతెన వద్ద భారీ స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ కమాన్తో పాటు 80 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ కటౌట్ ఏర్పాటు పనులు చకచక సాగుతున్నాయి.
ఇలాంటి స్వాగత తోరణం, కటౌట్లు టిప్పుఖాన్ వంతెన నుంచి అప్పా మీదుగా తెలుగువిజయం వరకు డజనుకు పైగా ఏర్పాటు చేస్తున్నారు. మహానాడులో పార్టీ అధినేత నారా చంద్రబాబు పాల్గొనే సమయంలో టిప్పుఖాన్ వంతెన నుంచి సభాస్థలి వరకు రెండువేల బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించే యోచనలో ఉన్నారు.
Posted by
arjun
at
11:32 PM