May 24, 2013

నేడు టీడీపీలోకి ఓయూ విద్యార్థి నేత రాజారాం


ఉస్మానియా వర్సిటీకి చెందిన విద్యార్థి నేత రాజారాం యాదవ్ శనివారం టీడీపీలో చేరనున్నారు. ఆయన ఓయూ విద్యార్థి జేఏసీకి అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఓయూ జేఏసీలో కీలకపాత్ర పోషించిన విద్యార్థి నేతల్లో రాజారాం ప్రముఖుడు. ఆయన ..పెద్ద సంఖ్యలో విద్యార్థులతో కలిసి టీడీపీలో చేరుతున్నారు.
ఒకప్పుడు దేవేందర్ గౌడ్‌కు సన్నిహితంగా ఉన్న రాజారాం తర్వాత తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు సన్నిహితంగా మారారు. కాని ఆ పార్టీలో బీసీలకు అవకాశాలు రావడం లేదని ఆయన కినుక వహించారు.