May 31, 2013
హైదరాబాద్:
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి యస్ అన్నాకే అవినీతి జరిగిందని, వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్
రెడ్డి అక్రమాస్తుల కేసును సిబిఐ క్షుణ్ణంగా విచారించాలని తెలుగుదేశం
పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య కోరారు. జగన్కు అవినీతి సామ్రాజ్యాన్ని
నిర్మించిన డైరెక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డే అన్నారు. జగన్ అవినీతిలో వైయస్
పాత్ర ఎంత వరకు ఉందో వెలికితీయాలన్నారు. ఆయన మృతి చెందాడన్న సానుభూతి
అవినీతిని నిగ్గుతేల్చే విషయంలో పనికి రాదని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
Posted by
arjun
at
5:53 AM