April 22, 2013

విద్యార్థుల ఆత్మహత్యలను కేసీఆర్ చందాలు చేసి కోట్టు దండుకున్నారు.

వరంగల్ : తెలంగాణ పేరుతో టీఆర్ఎస్ పార్టీ వసూళ్లకు పాల్పడిందని టి.టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ పోలవరం వ్యవహారంలో రూ.500 కోట్లు దండుకున్నారన్నారు. టీఆర్ఎస్ నేతల వసూళ్లపై ఆధారాలు ఉన్నాయని, బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా అని ఎర్రబెల్లి సవాల్ విసిరారు.

విద్యార్థుల ఆత్మహత్యలను కేసీఆర్ చందాలు చేసి కోట్టు దండుకున్నారని దుయ్యబట్టారు. బయ్యారం గనుల కోసం మొదటి నుంచి పారాడింది టీడీపీనే అని స్పష్టం చేశారు. బయ్యారం గనులు తెలంగాణ ఆస్తి అని, తరలిస్తే ఊరుకోమని హెచ్చరించారు. బయ్యారంపై టీఆర్ఎస్ ఎప్పుడూ ధర్నా కూడా చేయలేదని ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు.