December 4, 2012
వెయ్యి లారీల డబ్బు దోచారు! చంద్రబాబు
నిజామాబాద్, డిసెంబర్ 4 : వైఎస్ కుటుంబం వెయ్యి లారీల డబ్బు దోచిందని,
ఇప్పటిదాకా 430 లారీల డబ్బును సీబీఐ గుర్తించిందని టీడీపీ అధినేత చంద్రబాబు
దుయ్యబట్టారు. 'జనం భాషలో జగన్ పని పట్టండి' అని సోమవారం టీడీఎల్పీ భేటీలో
పిలుపునిచ్చిన అధినేత.. మంగళవారం తానూ అదే బాట పట్టారు. బండారుపల్లి,
పెదమావంది, చినమావంది, పెగడాపల్లి గ్రామాల్లో జరిగిన సభల్లో వైఎస్,
జగన్లపై చెలరేగి విమర్శలు చేశారు. జగన్ ఇంత డబ్బు ఎలా తిన్నాడని
సుప్రీంకోర్టు జడ్జి ఆశ్చర్యపోయిన విషయాన్ని గుర్తు చేశారు.
దోచి విదేశాల్లో దాచిన ఆ డబ్బులో సగం ప్రజలకు ఇచ్చినా రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉండేదని వ్యాఖ్యానించారు. వైఎస్ హయాంలో 26 జీవోలు ఇచ్చి రాష్ట్రాన్ని లూటీ చేశారని, మంత్రులకూ ఆ అవినీతిలో వాటాలు ఉన్నాయని విమర్శించారు. పంచాయతీ బోర్డుకు కూడా గెలువలేని వైసీపీ నేతలకు తాను సమాధానం చెప్పాలా? అని ప్రశ్నించారు. వైసీపీ, టీఆర్ఎస్లు ఎప్పటికైనా కాంగ్రెస్లో కలిసే పార్టీలేన న్నారు. ఈ మేరకు కాంగ్రెస్లో కలిసేందుకు వైసీపీ రాయబారం నడుపుతోందని దుయ్యబట్టారు.
దోచి విదేశాల్లో దాచిన ఆ డబ్బులో సగం ప్రజలకు ఇచ్చినా రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉండేదని వ్యాఖ్యానించారు. వైఎస్ హయాంలో 26 జీవోలు ఇచ్చి రాష్ట్రాన్ని లూటీ చేశారని, మంత్రులకూ ఆ అవినీతిలో వాటాలు ఉన్నాయని విమర్శించారు. పంచాయతీ బోర్డుకు కూడా గెలువలేని వైసీపీ నేతలకు తాను సమాధానం చెప్పాలా? అని ప్రశ్నించారు. వైసీపీ, టీఆర్ఎస్లు ఎప్పటికైనా కాంగ్రెస్లో కలిసే పార్టీలేన న్నారు. ఈ మేరకు కాంగ్రెస్లో కలిసేందుకు వైసీపీ రాయబారం నడుపుతోందని దుయ్యబట్టారు.
Posted by
arjun
at
9:10 PM