December 9, 2012

ఆదిలాబాద్ జిల్లా వాసులకు గోదావరి జలాలందిస్తాం..


ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తాగునీటి కోసం అ నేక ఇబ్బందులకు గురవుతున్నారనీ, గోదావరి జలాలను జిల్లాలోని ప్రతి ప ల్లెకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటానని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. వస్తు న్నా.. మీ కోసం పాదయాత్రలో భా గంగా ఆదిలాబాద్ జిల్లాలోని అర్లి క్రాస్ రోడ్, కుంటాల క్రాస్్‌రోడ్, నం దన్ క్రాస్‌రోడ్, నర్సాపూర్ (జి) క్రాస్‌రోడ్, చర్లపల్లి వరకు 11.5 కిలో మీ టర్లు ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఆయన మాట్లాడారు. జిల్లాలో అనేక గ్రామాల్లో పారిశుధ్యం లోపించిందన్నారు. రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, తాము అధికారంలోకి వ చ్చిన తరువాత గ్రామాల్లో నెలకొన్న స మస్యలను పరిష్కరిస్తానని అన్నారు. రైతుల, ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే పాదయాత్రను ప్రారంభించానని, ఇప్పటి వరకు 1100 కిలో మీటర్ల పాదయాత్ర పూర్తి చేశానని ఆయన చెప్పా రు.

జిల్లాలో ఉర్దూ టీచర్ల పోస్టులు 324 ఖాళీ ఉన్నప్పటికీ ఆ పోస్టులను భర్తీ చేయలేదని ఆయన విమర్శించారు. టీడీపీ హయాంలో ఉర్దూ టీచర్ల పోస్టులను భర్తీ చేశామనీ, ముస్లింల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ముస్లిం ల కోసం 2500 కోట్ల రూపాయలతో ఇ స్లామిక్ బ్యాంకును ఏర్పాటు చేసి వడ్డీలేని రుణాన్ని అందిస్తామన్నారు. ము స్లింల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని ఆయన తెలిపారు. అవినీతి, అసమర్థ, దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. జిల్లాలో లక్షలాది ఎకరాల్లో రైతులు ప త్తిపంటను సాగు చేశారని, పెట్టుబడి పెరిగి దిగుబడి తగ్గి వచ్చిన కొద్దిపాటి పత్తిని విక్రయిద్దామనుకున్న రైతన్నకు మద్దతు ధర లభించడం లేదన్నారు. పత్తి రైతులను ఆదుకునేందుకు మద్దతు ధర లభించే వరకు తాను పోరాటం చే స్తానని అన్నారు. క్వింటాలు పత్తికి రూ. 5 వేల ధర చెల్లించాలని డిమాండ్ చే శారు.

పత్తి రైతుల సమస్యల పరిష్కా రం కోసం త్వరలోనే ఆదిలాబాద్‌లో లేకుంటే కరీంనగర్‌లో ఒకరోజు పెద్ద ఎత్తున ధర్నా చేస్తానని ఆయన అన్నారు. రైతు సమస్యలు స్వయంగా చూసిన తాను ఎంతో ఆవేదన చెందాన ని, రైతులు తీసుకున్న అన్ని రకాల రు ణాలను మాఫీ చేస్తానని ఆయన చెప్పా రు. సమావేశాల్లో ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేష్, టీడీపీ జిల్లా అధ్యక్షు డు, బోథ్ ఎమ్మెల్యే నగేష్, టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీశైలం, వికలాంగుల సంక్షేమ కార్పోరేషన్ చైర్మన్ కోటేశ్వర్‌రావు, టీడీపీ సీనియర్ నాయకులు పాయల శంకర్, లోలం శ్యామ్ సుంద ర్, నారాయణరెడ్డి, బాబర్, యూనిస్ అక్బానీ, జీవి రమణ, అందుగుల శ్రీనివాస్, జుట్టు అశోక్, రమాదేవి, జైపూర్ మాజీ జడ్పీటీసీ పెద్దపల్లి తిరుపతి, కడెం మాజీ ఎంపీపీ రాజేశ్వర్‌గౌడ్, సి. శంకర్ పాల్గొన్నారు.

రోజురోజుకు పెరుగుతున్న జనం: చంద్రబాబునాయుడి పాదయాత్ర కు, సభలకు రోజు రోజుకు ప్రజలు అధి క సంఖ్యలో హాజరవుతున్నారు. జిల్లా లో చంద్రబాబునాయుడి పాదయాత్ర ఆదివారంతో నాలుగో రోజుకు చేరుకుం ది. పాదయాత్రను జయప్రదం చేసేందుకు ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథో డ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, బోథ్ ఎ మ్మెల్యే నగేష్, మాజీ జడ్పీ చైర్మన్ లో లం శ్యామ్‌సుందర్, నియోజక వర్గాల ఇన్‌చార్జీలు పాయల శంకర్, నారాయణరెడ్డి, బాబర్ తదితర నాయకులు జ నసమీకరణ దృష్టి సారించారు. సభల కు వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని సమీకరిస్తున్నారు. దీనికి తోడు టీడీపీ మైనార్టీ రాష్ట్ర నాయకుడు యూనిస్ అక్బానీ పాదయాత్ర వెళ్లే గ్రామాల్లోని మైనార్టీలను సభలకు తరలిస్తున్నారు.