November 8, 2012

రుణమాఫీ ఎలా చేస్తానో చేసి చూపిస్తా, తల్లిదండ్రులకు ఆడపిల్లలు భారం కాకుండా నిరుద్యోగభృతి కల్పిస్తా.......చంద్రబాబు



వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలి
రుణమాఫీ ఎలా చేస్తానో చేసి చూపిస్తా
పేదల పక్షంగా టీడీపీ పోరాటం
ఆడపిల్లలకు నిరుద్యోగభృతి
రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవడారికి వైఎస్ పాలనే కారణమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తు చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపినిచ్చారు. పేదలకు న్యాయం జరగాలన్నదే తమ ధ్యేయమని, అందుకే పాదయాత్ర చేపట్టానని చెప్పారు.

జిల్లాలోని మల్లపురం గేట్ వద్ద చంద్రబాబునాయుడు ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ తల్లిదండ్రులకు ఆడపిల్లలు భారం కాకుండా నిరుద్యోగభృతి కల్పిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని ఆరోపించారు. రైతుల రుణమాఫీ ఎలా చేస్తానో చెప్పను, చేసి చూపిస్తానని అన్నారు. టీడీపీ పేదల పక్షంగా నిలబడి పోరుడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. సూరారం వద్ద ఎమ్మార్పీఎస్ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న బాబు వర్గీకరణ దిశగా టీడీపీ నిర్ణయం వెలువరిస్తుందని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ నిధులు కాజేస్తూ కాంగ్రెస్ నేతలు ప్రజా ద్రోహులుగా మారరని చంద్రబాబు విమర్శించారు. నల్గొండజిల్లా, సూర్యాపేట మున్సిపల్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సహా ఆరువందల మంది కాంగ్రెస్ నేతలు బాబు సమక్షంలో టీడీపీలో చేరారు. డీఎస్సీ ద్వారా లక్ష ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీడీపీదేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బుల వసూళ్ళకు పాల్పడుతూ ఇష్టానుసారం కళాశాలలకు అనుమతులిస్తుందని ఆయన ఆరోపించారు. అర్హత ఉన్న అభ్యర్ధులకు ఉద్యోగాలు లేకుండాపోయాయని చంద్రబాబు పేర్కొన్నారు.

జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర 34వ రోజుకు చేరుకుంది. గురువారం ఉదయం కోయిల్‌కొండ మండలం సేరివెంకటాపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి విక లాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. అలాగే జిల్లాలో నారాయణపేట నియోజకవర్గంలో సాగుతున్న పాదయాత్రలో ఆయన శేరి వెంకటాపూర్, లింగాలచెడ్, సురారం తదితర గ్రామాల్లో ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు చంద్రబాబుకు వినతిపత్రాలు సమర్పించారు.

No comments :

No comments :