November 6, 2012

‘దేవుడి’ పాలనలో ‘రామదాసు’ ను మించి కారాగారం లో రామ కోటి రాయడం మొదలెట్టి...

దేవుడి’ పాలనలో
‘రామదాసు’ ను మించి
కారాగారం లో రామ కోటి రాయడం మొదలెట్టి
అడ్డొచ్చాడని మొద్దు సీనును చంపేసిన
ఓం ప్రకాష్ అనే భక్తుడు
ప్రస్తుతం ‘కడప’ కారాగారం లో
కాలం వెళ్ళదీస్తూ
రెండు మొబైల్ ఫోన్ లు
స్వయంగా జైలు అధికారులకు
స్వాధీనం చేసాడంట
మరో రెండు తనిఖీల్లో దొరికాయంట

అట్టాంటిది అప్పటి ‘దేవుడి’ భక్తులే
నేడు ఏలుతుంటే
‘దేవుడి’ కొడికి దగ్గర
ఏమీ లేవంటే
ఎవరు నమ్ముతారో

ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులను
దేవుడి బిడ్డ నిధులతో
ఒక ప్రక్క కొనుగోలు చేస్తూ
మరో ప్రక్క ప్రతిపక్షాన్ని
అవిశ్వాసం పెట్టండంటూ
విమర్శిస్తూ వుంటే
వింతగా
నమ్మినట్టు నటిస్తున్నారు పాలకులు


www.chaakirevu.wordpress.com
No comments :

No comments :