November 6, 2012

నీలం తుపానును ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలం, తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలి- 36వ రోజు పాదయాత్రలో చంద్రబాబు



తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు మహబుబ్‌నగర్‌ జిల్లాలో చేపట్టిన వస్తున్న మీకోసం పాదయాత్ర ఈ రోజు నారాయణపేట నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి, మంత్రులు పెళ్లి ,ఢీల్లికి మాత్రమే పరిమితమయ్యారని విమర్శించారు. నీలం తుపానును ఎదుర్కోవడంతో ప్రభుత్వం యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. కనీసం కంట్రోల్‌ రూమ్‌లు కూడా ఏర్పాటు చేయలేకపోయిందని. తెదేపా హయాంలో సచివాలయాన్ని రాజమండ్రికి తరలించినట్లు గుర్తు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రదాని, సోనియా పర్యటించాలని డిమాండ్‌చేశారు. తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రదానికి లేఖరాయనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
No comments :

No comments :