November 15, 2012

278 గ్రామాల్లో 700 కిలోమీటర్ల మైలురాయిని దాటిన 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర

వస్తున్నా మీ కోసం' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర 700 కిలోమీటర్లకు చేరింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవరాంపల్లి గ్రామంలో ఆయన ఈ మైలురాయిని దాటారు. అనంతపురం జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లోని 100 గ్రామాల్లో, కర్నూలు జిల్లాలో నాలుగు నియోజకవర్గాల పరిధిలోని 54 గ్రామాల్లో, మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో 74 గ్రామాల్లో, రంగారెడ్డి జిల్లాలో రెండు నియోజకవర్గాల్లోని 50 గ్రామాల్లో ఆయన తన పర్యటన జరిపారు.

మొత్తం 278 గ్రామాల్లో ఆయన వేల మంది ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకొన్నారని, ప్రజలతో మమేకం కావడం ద్వారా వారికి మరింత మంచి భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న ఈ యాత్రకు అందరూ నిండు హృదయంతో సహకరించాలని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు కంభంపాటి రామ్మోహనరావు ఒక ప్రకటనలో కోరారు.

No comments :

No comments :