November 15, 2012

ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్ననాడు టీఆర్ఎస్ ఒక్కపనైనా చేసిందా?..15.11.2012



ప్యాకేజీలు కేసీఆర్‌కే
ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్ననాడు
టీఆర్ఎస్ ఒక్కపనైనా చేసిందా?
నాకు 42 మంది ఎంపీలను ఇవ్వండి..
రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి చూపిస్తా
రాష్ట్రంలో కాంగ్రెస్ దొంగలు..
అడవి పందుల్లా, పందికొక్కుల్లా తింటున్నారు
పాదయాత్రలో చంద్రబాబు ధ్వజం
"అడవి పందులు తిన్నంత తిని మిగిలిన పంటను నాశనం చేస్తాయి.. అలాగే కాంగ్రెస్ వాళ్లు కూడా రాష్ట్రాన్ని దోచుకు తినడమేకాక మిగిలిన వ్యవస్థలను సర్వనాశనం చేశారు'' అని టీడీపీ అధినేత చంద్రబాబు నా యుడు పేర్కొన్నారు. 'మీకోసం వస్తున్నా'లో భాగంగా గురువారం ఆ యన రంగారెడ్డిజిల్లా షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడ, ఏట్ల ఎర్రవల్లి, దేవరంపల్లి, రేగడిఘనాపూర్, ఖానాపూర్, నాంచేరిగేట్, బస్తేపూర్, మీ ర్జాగూడ క్రాస్‌రోడ్ల మీదుగా పాదయాత్ర చేశారు.

మార్గమధ్యంలో గ్రా మస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి క ష్టాలు విన్న చంద్రబాబు.. రాష్ట్రంలో కాంగ్రెస్ దొంగలు పడ్డారని, ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందిన కాడికి దోచుకోవడమే కాక రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని మండిపడ్డారు. "మీరు కట్టే పన్నులను, మీ శ్రమను పందికొక్కుల్లా భోజనం చేస్తున్నా రు. ఇదంతా మీ ఇంటి సొమ్మేనన్న విషయం గుర్తుంచుకోండి'' అన్నారు. అవినీతిపరులకు నిలయంగా మారిన చంచల్‌గూడ జైలు నుంచి కొం దరు శవరాజకీయాలకు, నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని విమ ర్శించారు.

తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని.. ఒకసారి టీఆర్ ఎస్‌ని, మరోసారి వైసీపీని వాడుకుంటోందన్నారు. టీఆర్ఎస్ ఏడాది న్నర పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉండి అధికారాన్ని అనుభవించిందని ఆ సమయంలో ఒక్క పనైనా చేసిందా అని ప్రశ్నిం చారు. తెలంగాణపై కాంగ్రెస్ తేల్చకుండా టీడీపీపై నింద వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 'సామాజిక తెలంగాణ' అన్న ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ తనలో కలిపేసుకుందని.. మిగతా రెండు పార్టీలతో బేరాలు మొదలుపెట్టిందన్నారు.

"టీఆర్ఎస్‌తో చర్చలు జరుపుతున్నారు. ప్యాకేజీలు అంటున్నారు. ఎవరికి ఇస్తారు, టీఆర్ఎస్‌కేనా?'' అని ప్రశ్నించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్నాళ్లు ఉంటారో తెలియదని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ఒక్కటేనని కనీసం పేరు కూడా మా ర్చుకోలేదని ఎద్దేవా చేశారు. చిరంజీవి లేకుంటే గత ఎన్నికల్లో టీడీపీనే గెలిచేదన్నారు. దేవరంపల్లిలో ఓ రైతు.. "యూరియా ధర రూ.500 పెరిగిపోయింది. వ్యవసాయం చేయాలంటే భయం వేస్తోంది'' అని వాపోయారు.

దీనికి స్పందించిన చంద్రబాబు.. "రాష్ట్రం నుంచి 10 మంది కేంద్ర మంత్రులున్నారు. వారంతా శుద్ధ దండగ. గతంలో మీరు టీడీపీకి అధికంగా ఎంపీలను ఇస్తే కేంద్రంలో చక్రం తిప్పాం. ఒక్క ఫోన్‌కాల్‌తో సమస్యలను పరిష్కరించే వాళ్లం. వచ్చే ఎన్నికల్లో నాకు 42 ఎంపీ సీట్లు ఇవ్వండి.. యూరియా ధర సమస్యతో పాటు రాష్ట్రంలోని అన్ని సమస్యలనూ పరిష్కరిస్తానని బాబు చెప్పారు. బాబు పాద యాత్రలో టీడీపీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఉమా మాధవరెడ్డి, చంద్రరావు, రత్నం, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. బాబుకు సంఘీ భావంగా సాంకేతిక విద్యాశాఖ మాజీ కమిషనర్ లక్ష్మీనారాయణ కూడా పాల్గొని రాత్రి దాకా నడిచారు.

No comments :

No comments :