October 1, 2012

యాత్రలో కుటుంబం

 వస్తున్నా మీకోసం పాదయాత్రలో తొలి రోజు చంద్రబాబు కుటుంబం మొత్తం పాల్గోనబోతుంది. బాబు సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్‌లు మొదటి రోజు యాత్రలో పాల్గొంటారు. అయితే కోడలు బ్రాహ్మణి మాత్రం యాత్రలో పాల్గొనడం లేదు. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. దీంతో ఆమె యాత్రకు  దూరంగా ఉంటున్నారు.
ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ కూడా బాబు యాత్ర చేస్తున్న సమయంలో మధ్యలో ఓసారి ఆయనను కలవనున్నారు. యాత్ర ప్రారంభానికి ముందు మంగళవారం రోజు చంద్రబాబు తన ఇంటి నుండి నేరుగా సికింద్రాబాదులోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు వెళ్తారు. ఆక్కడ ఆయనకు నివాళులు అర్పిస్తారు. అక్కడి నుండి ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్ళి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళి, అటు నుండి బెంగుళూర్ వెళ్ళి అక్కడ నుండి రోడ్డు మార్గంలో అనంతపురం వెళ్తారు.

No comments :

No comments :