October 13, 2012
బాబును పరామర్శించిన భువనేశ్వరి & 12వ రోజు యాత్ర పోటోలు
అనంతపురం జిల్లాలో 12 రోజులుగా పాదయ్రాత చేస్తున్న
చంద్రబాబు నాయుడును ఆయన సతీమణి నందమూరి భువనేశ్వరి శనివారం ఉరవకొండ మండలం
చిన్నహోతూరు వద్ద కలిసి పరామర్శించారు. శుక్రవారం పాదయాత్రలో ఆయన
అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకున్న ఆమె హుటాహుటిన హైదరాబాద్ నుంచి
బయలుదేరి బాబు బసచేసిన ప్రాంతానికి చేరుకున్నారు.
ఆయన బస చేసిన బస్సులోకి వెళ్లి పరామర్శించారు. బాబు ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. వెన్ను పట్టేయడం, కాలికి బొబ్బలు రావడం తదతర వాటిని చూసిన భువనేశ్వరి ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తనకేమీ కాదని, ప్రజల కష్టాల ముందు తన ఇబ్బందులు లెక్కలోకి రావని చంద్రబాబు ఆమెతో అన్నట్లు సమాచారం. ఆదివారం కూడా భువనేశ్వరి చంద్రబాబు వెంటే ఉండి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారని, గుంతకల్లు సమీపంలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాల యంలో చంద్రబాబు పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని సమాచారం.
ఆయన బస చేసిన బస్సులోకి వెళ్లి పరామర్శించారు. బాబు ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. వెన్ను పట్టేయడం, కాలికి బొబ్బలు రావడం తదతర వాటిని చూసిన భువనేశ్వరి ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తనకేమీ కాదని, ప్రజల కష్టాల ముందు తన ఇబ్బందులు లెక్కలోకి రావని చంద్రబాబు ఆమెతో అన్నట్లు సమాచారం. ఆదివారం కూడా భువనేశ్వరి చంద్రబాబు వెంటే ఉండి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారని, గుంతకల్లు సమీపంలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాల యంలో చంద్రబాబు పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని సమాచారం.
Subscribe to:
Post Comments
(
Atom
)
No comments :
Post a Comment