September 18, 2013

రాజగోపాలరెడ్డి మృతికి చంద్రబాబు సంతాపం

కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి రెడ్డివారి రాజగోపాలరెడ్డి మృతికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. వ్యవసాయ, రవాణా శాఖల మంత్రిగా ఆయన రాష్ట్ర ప్రజలకు, కడప జిల్లా ప్రజలకు ఎనలేని సేవలు అందించారని, టిడిపిలో ఉన్నంతకాలం క్రియాశీలంగా వ్యవహరించి పార్టీ పటిష్టతకు పాటుపడ్డారని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మరణం రైతులకు, కడప జిల్లా ప్రజలకు తీరనిదని చంద్రబాబు అన్నారు.