July 17, 2013

కేంద్ర నిర్ణయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేత యనమల రామకృష్ణుడు

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం తలుపులు బార్లా తెరవడంపై తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. కీలక రంగాల్లోకి ఎఫ్‌డీఐలు సరికాదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. బీమా, రక్షణతో పాటు మరో 12 రంగాల్లో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు లను ఆహ్వానించడం దేశ సమగ్రతేక చేటని తెలిపారు. బుధవారం యనమల పార్టీ కార్యాల యంలో విలేకరులతో మాట్లాడారు. కీలక రంగాల్లో వంద శాతం ఎఫ్‌డీఐలకు అనుమతిం చడం సరైంది కాదని, యూపీఏ ప్రభుత్వ అసమర్థ విధానాలకు ఈ నిర్ణయం పరాకాష్ట అని మండిపడ్డారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా తొమ్మిది శాతం విద్యుత్ లోటు, ఆర్థిక మాంద్యం, అధిక వడ్డీ రేట్ల కారణంగా కుదులయిన భారత పారిశ్రామిక రంగంపై కేంద్ర తాజా నిర్ణయం గోరుచుట్టు విూద రోకలిపోటు లాంటిదేననని ధ్వజమెత్తారు. విదేశీ పెట్టుబడులపై ఎందుకంతా ఆసక్తి? అని ప్రశ్నించారు. విదేశీ పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలేవో స్వదేశీ పెట్టుబడిదారులకు ఇచ్చేలా ప్రధాని మన్మోహన్‌సింగ్ బృందం చొరవచూపాలని డిమాండ్ చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతున్న తరుణంలో దిక్కుతోచని స్థితిలో పడిన కేంద్ర ప్రభుత్వం.. మంగళవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. సంస్కరణల పేరుతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచింది. కీలకమైన పన్నెండు రంగాల్లో వంద శాతం ఎఫ్‌డీఐలకు అనుమతిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. రక్షణ, టెలికం, పౌరవిమానయాన, బీమా, పెట్రోలియం, విద్యుత్ వంటి ముఖ్యమైన రంగాలలో 49 శాతంగా ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని ఎత్తేసింది. అయితే, ఈ నిర్ణయం వల్ల దేశ సమగ్రత దెబ్బతింటుందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రక్షణ, విద్యుత్, బీమా వంటి కీలక రంగాల్లో 100 శాతం ఎఫ్‌డీఐలకు ఆమోదం తెలపడాన్ని తపబట్టాయి. ఆర్థిక వ్యవస్థ దిగజారుతుంటే చేతులు ముడుచుకొని కూర్చున్న ప్రభుత్వం చివరకు ఎఫ్‌డీఐలకు బార్లా తెరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి.