July 21, 2013

నిజాయతీ ఉన్నసర్పంచిని ఎన్నుకోవాలి:బాబు

 పంచాయతీ ఎన్నికల్లో నిజాయతీ ఉన్న సర్పంచిని ఎన్నుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇవాళ చంద్రబాబు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మంచి సర్పంచి విజయం సాధిస్తేనే గ్రామాలు సురక్షితంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థలను బలోపేతం దిశగా తీసుకెళ్లింది టీడీపీనే అని తెలిపారు. స్థానిక సంస్థలు బలంగా ఉంటేనే సరైన నాయకత్వం ఉంటుందన్నారు. స్థానిక సంస్థలను కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. సుపరిపాలన కోసం తాము గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తే వాటిని కాంగ్రెస్ నామరూపాలు లేకుండా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచికి ఉన్న అధికారాలను కాంగ్రెస్ క్రమంగా తగ్గించుకుంటూ వచ్చిందన్నారు.