May 26, 2013
కేసీఆర్ భాష మారాలి
నెల్లూరు : కేసీఆర్ మాట్లాడే తీరును మార్చుకోవాలని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సూచించారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే ఆయన మాట్లాడే ప్రస్తుత భాషే అధికార భాష అవుతుందేమోనని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఉద్యమాలు చేసే వారు ఎవరూ కేసీఆర్లా దిగజారి మాట్లాడడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ మాట్లాడే తీరును మార్చుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో వడదెబ్బ మరణాలు పెరుగుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Posted by
arjun
at
5:56 AM