May 19, 2013

ఆధిపత్యపోరుపై బాబు ఆగ్రహం

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌, అంబర్‌పేట నియోజకవర్గాల్లో మినీ మహానాడు నిర్వహణకు జరుగుతున్న ఆధిపత్యపోరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో మినీ మహానాడు నిర్వహించరాదని ఆయన పార్టీ నేతలను ఆదేశించారు. బాబు ఆదేశాలు పాటించకుండా కొందరు మినీ మహానాడును నిర్వహించడంపై ఆయన మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో మినీ మహానాడు నిర్వహించిన టీడీపీ కార్పొరేటర్లు మురళీగౌడ్‌, విజయలక్ష్మి, సదాశివ్‌యాద్‌పై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.