November 11, 2012

బాబుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల సంఘీభావం





మీ చలవతోనే ఐటీ నిపుణులమయ్యాం
బాబుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల సంఘీభావం


"మేం రైతు బిడ్డలం. మీ చలవతో సాఫ్ట్‌వేర్ నిపుణులమయ్యాం. మీ స్ఫూర్తితో ఎదిగాం. మీ రుణం తీర్చుకోవాలని.. కలిసి సంఘీభావం తెలపాలని వచ్చాం'' - హైదరాబాద్ హైటెక్ సిటీలో పనిచేసే 250 మందికిపైగా ఐటీ నిపుణులు చంద్రబాబుతో అన్న మాటలివి. దోమ మండలం మోత్కూరులో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును ఆదివారం కలిసి వారు సంఘీభావం తెలిపారు. ఐటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు రఘునాథ్ చౌదరి, బ్రహ్మయ్య, అజిత్ పాష, వెంకట్, రజనీకాంత్, రమేశ్ తదితరులు బాబును కలిశారు.

ఐటీ రంగం మీవల్లే అభివృద్ధి చెందిందని, తమకు ఉద్యోగాలు వచ్చాయని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి కారణంగా ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ మీరు అధికారంలోకి వస్తే ఐటీ రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆకాంక్షించారు. ఢిల్లీలో లా చదువుతున్న వరంగల్‌కు చెందిన విద్యార్థి మోత్కూరు చేరుకుని చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.
No comments :

No comments :