November 4, 2012
వరద బాధితులకు అండగా నిలవాలి...
నీలం తుఫాను నేపధ్యంలో రాష్ట్రంలో
భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని పార్టీ శ్రేణులకు తెలుగుదేశం
పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ జిల్లా పాదయాత్రలో ఉన్న
చంద్రబాబు ఆదివారం ఉదయం పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విపత్కర పరిస్థితులు
నెలకొన్న జిల్లాల్లోని పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా ఇన్ఛార్జీలు,
నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండలస్థాయి నేతలు వరద బాధితులను ఆదుకోవాలని కోరారు.
అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలోనూ, వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంలోనూ సహకరించాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. వరద బాధితులకు అండగా నిలవాలని ఆదేశించారు. బాధితులు తమ నివాసాలకు చేరేంతవరకు ఆహారం, వసతి, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసేలా అధికార యంత్రాంగాన్ని కదిలించడంతోపాటు తమ వంతు కృషి చేయాలని కోరారు.
అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలోనూ, వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంలోనూ సహకరించాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. వరద బాధితులకు అండగా నిలవాలని ఆదేశించారు. బాధితులు తమ నివాసాలకు చేరేంతవరకు ఆహారం, వసతి, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసేలా అధికార యంత్రాంగాన్ని కదిలించడంతోపాటు తమ వంతు కృషి చేయాలని కోరారు.
Subscribe to:
Post Comments
(
Atom
)
No comments :
Post a Comment