November 12, 2012

మనుషులమని, ప్రజా ప్రతినిధులమని మరిచిపోయి ఓ రేటుకు అమ్ముడుపోతున్న ఎమ్మెల్యే లు



రాష్ట్రంలో అత్యంత నీచమైన రాజకీయాలు జరుగుతున్నాయని చంద్రబాబు సోమవారం రంగారెడ్డి జిల్లా పరిగిలో జరిగిన పాదయాత్రలో వ్యాఖ్యానించారు. ఈ ప్రపంచంలో ఎక్కడా జరుగని విధంగా ఎమ్మెల్యేలలను సంతలో పశువుల్లా కొంటున్న నీచ చరిత్ర వైఎస్సార్సీపీకే దక్కుతుందన్నారు. వీరు కూడా తాము మనుషులమని, ప్రజా ప్రతినిధులమని మరిచిపోయి ఓ రేటుకు అమ్ముడుపోతున్నారని అన్నారు. వైఎస్సార్, జగన్ ఇద్దరూ కలిసి రాజకీయాలను డబ్బుతో కలుషితం చేశారన్నారు. అయినా దోచుకున్న డబ్బు కాబట్టే ఇంత విచ్చలవిడిగా ఖర్చుపెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. ఇపుడు మనుషుల్లో విలువలు పడిపోయానని, నేతల్లో అస్సలు లేవని ఆయన ఆవేదన చెందారు. చిన్న చిన్న స్వలాభాల కోసం వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దని, రాష్ట్రాన్ని నాశనం చేయవద్దని చంద్రబాబు “వలస” నేతలకు సూచించారు. రాజకీయాల్లో డబ్బు కొంతకాలమే కాపాడుతుందని, విలువలుంటేనే శాశ్వతంగా ఇక్కడ నిలదొక్కుకోగలమని అన్నారు. ఇదిలా ఉండగా ఈరోజు చంద్రబాబుకు ముస్లింలు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. వారినుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ మైనార్టీలకు స్వయం ఉపాధి కల్పించింది టీడీపీయే అన్నారు. మా హయాంలో మతకలహాలు లేకుండా రాష్ట్రం ప్రశాంతంగా గడిచిందన్నారు. కానీ, లౌకిక పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో అనేక చోట్ల అనేక సార్లు మతకలహాలు జరిగాయని అన్నారు.
No comments :

No comments :