March 13, 2013
మీకు బంగారు భవిష్యత్

ఈ సందర్భంగా విద్యార్థులను పలు అంశాలపై ప్రశ్నించారు. అదే విధంగా మీ పాఠశాలలో నూతన భవనాన్ని, అదనపు తరగతుల భవనాన్ని నిర్మించడానికి ఎమ్మెల్యే శివరామరాజు కృషి చేశారని, ఎమ్మెల్యేను విద్యార్థు లకు చూపించారు. మీకు బంగారు భ విష్యత్ ఉంటుందని, విద్యార్థుల కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేసిందన్నారు. మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఎన్టీ రామారావు, అల్లూరి సీతారామరాజులు తెలుసా అంటూ ప్రశ్నించి ఒక లక్ష్యం కోసం ఆదర్శమూర్తులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంలో డీఈడీకి చెందిన టీచర్లు చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు.
అది చదివిన చంద్రబాబు ఉపాధ్యాయ పోస్టులలో 40శాతం మహిళలకు రిజర్వేషన్ అమలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో సెట్ పరీక్షలు లేకుండా చేస్తామన్నారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షరాలు తోట సీతారామల క్ష్మీ, ఎమ్మెల్యే శివరామరాజు, రాష్ట్ర కా ర్యదర్శి మంతెన వెంకటసత్యనారాయణరాజు (పాందువ్వ శ్రీను), ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ఉన్నారు.
Posted by
arjun
at
3:22 AM