September 14, 2013
చంద్రబాబు నాయుడు కాలు కదిపితే వైసీపీ, టిఆర్ఎస్
పార్టీలకు వణుకు వస్తోందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పయ్యావుల
కేశవ్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.
'చంద్రబాబు ఢిల్లీ వెళ్ళాలనుకొంటున్నానని అనగానే ఈ పార్టీలు
గడగడలాడుతున్నాయి. ఆ యాత్రకు రకరకాల కారణాలు ఆపాదిస్తూ నోటికి వచ్చినట్లు
మాట్లాడుతున్నాయి. ఆయన ఢిల్లీ వెళ్తే తమ ముసుగులు ఊడిపోతాయని, తమ నిజ
స్వరూపం బయట పడుతుందని వాటి భయం. రాష్ట్రంలో రగులుతున్న మంటలను ఆర్పి
అందరికీ న్యాయం చేయమని చంద్రబాబు కోరుతున్నారు. దానికి వీరికేమిటి బాధ? ఇరు
పక్కలా ప్రజలను రెచ్చగొట్టి ఒకరిపైకి మరొకరిని ఉసిగొల్పి పబ్బం
గడుపుకోవాలని ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. సమస్యలు పరిష్కారమైతే తమ
పబ్బం గడవదని వీటి భయం. అందుకే బాబును తిటి ్ట పోస్తున్నాయి' అని ఆయన
విమర్శించారు.
ఢిల్లీ వెళ్తే తమ ముసుగులు ఊడిపోతాయని, తమ నిజ స్వరూపం బయట పడుతుందని వాటి భయం
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తమ పార్టీ
అధినేత చంద్రబాబునాయుడు లేఖ ఇస్తే విభజనను కేంద్రం ఆపేస్తుందా అని
టీడీఎల్పీ ఉప నేత, నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు ప్రశ్నించారు.
తిరుపతిలోని పూలే విగ్రహం వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం రజకులు
చేపట్టిన దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు.
దీక్షా శిబిరం వద్ద దుస్తులను ఇస్త్రీ చేస్తూ వారికి మద్దతు ప్రకటించి మాట్లాడారు. రెండు ప్రాంతాల ప్రజలకు నష్టం కలగకుండా చూడాలని చంద్రబాబు లేఖ రాస్తే.. రాష్ట్రాన్ని విభజించాలని ఆయన కోరినట్లు కాంగ్రెస్, వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. దీన్ని కూడా రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకోవడం దారుణమన్నారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ను వదలి టీడీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా బీసీలంతా ఒకతాటిపైకి రావడం అభినందనీయమన్నారు. హైదరాబాద్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు రావడానికి చంద్రబాబు కృషే కారణమన్నారు.
లేఖ ఇస్తే సమైక్యాంధ్ర ప్రకటిస్తారా?
Subscribe to:
Posts
(
Atom
)