June 8, 2013
కేసీఆర్కు డబ్బే ముఖ్యం: పెద్ది
ఇదిలా ఉంటే, టీఆర్ఎస్పై టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్కు తెలంగాణపై చిత్తశుద్ధి లేదన్నారు. కేసీఆర్ తెలంగాణను వదిలేసి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఆయనకు తెలంగాణ మూడో ప్రాధాన్యతాంశమని, డబ్బు, కుటుంబం మొదటి రెండు ప్రాధాన్యతలన్నారు. తెలంగాణపై టీడీపీ ఇప్పటికే స్పష్టత ఇచ్చిందన్నారు. తెలంగాణ కోసం చలో అసెంబీే్లక కాదు.. చలో ఢిల్లీకైనా సిద్ధమని ప్రకటించారు.
అవినీతికి కాంగ్రెస్దే బాధ్యత
నాగరాజు బొంతపురుగు పాటి చేయడా?: పెద్దిరెడ్డి
హైదరాబాద్ : అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన తొమ్మిది మంది కాంగ్రెస్, ఆరుగురు టిడిపి ఎమ్మెల్యేలపై అనర్హతా వేటుకు రంగం సిద్ధమైంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మార్చి15న అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. అనర్హత పిటిషన్లు దాఖలు చేసిన తర్వాత దాదాపు రెండున్నర నెలల పాటు స్పీకర్ నాదెండ్ల మనోహర్ విచారణ నిర్వహించారు. ఈ రోజు సాయంత్రంలోగా నిర్ణయాన్ని స్పీకర్ కార్యాలయం ప్రకటించే అవకాశం వుంది.
విప్ ధిక్కార ఎమ్మెల్యేలపై వేటుకు సిద్ధం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేతులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మండిపడుతున్నారు. టిడిపి నేతలు తుమ్మల నాగేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడుతూ కిరణ్ ముఖం చూడలేక రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారన్నారు. ప్రచార ఆర్భాటానికి చేస్తున్న ఖర్చులో పది పైసలు కూడా సంక్షేమ కార్యక్రమాలకు పెట్టడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రచార ఖర్చుల వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయిందన్నారు. వ్యవసాయ పనిముట్ల వ్యవహారంపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సిఎం ప్రచార ఆర్బాటం: టిడిపి
హైదరాబాద్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ప్రాధాన్యతలు
మారిపోయాయని టిడిపి నేత పెద్దిరెడ్డి అన్నారు. డబ్బు, కుటుంబ ప్రయోజనాల
తర్వాతే తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ తెలంగాణ
రాకుండా చూసుకునే పార్టీగా మారిపోయిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం
ఒప్పందాల్లో భాగంగానే ఎంపీలు టీఆర్ఎస్ లో చేరారని చెప్పారు. కెసిఆర్ కు
సోనియా దేవత అని, కె.కేశవరావు దేవదూత అని పెద్దిరెడ్డి అన్నా
కెసిఆర్ ప్రాధాన్యతలు మారిపోయాయి: పెద్దిరెడ్డి
వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై
టీడీపీ నేత వర్లరామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశాన్ని,
రాష్ట్రాన్ని, న్యాయవ్యవస్థను కించపర్చేలా భారతి మాట్లాడారని, ప్రజలకు ఆమె
క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులపైనే చేయి చేసుకుంటారా అని
ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని దోచుకుంటే భారతికి విలాసవంతమైన
భవనాలు వచ్చాయని, వైఎస్ సీఎం కాకపోతే లోటస్పాండ్లో భవనం కట్టేవారా అని
ప్రశ్నించారు. జగన్ చేసిన నేరాలకు చైనాలో ఉరితీసేవారన్నారు. 2004లో ఏమీ
లేని జగన్కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయన్నారు. వైఎస్ కుటుంబానిది మొత్తం
నేర చరిత్ర కాదా అని వర్లరామయ్య పేర్కొన్నారు.
వైఎస్ భారతి ప్రజలకు క్షమాపణ చెప్పాలి : వర్లరామయ్య
Subscribe to:
Posts
(
Atom
)