
హైదరాబాద్ ఐఏఎస్ అధికారులను పావులుగా వాడుకొన్నారు. శ్రీలక్ష్మి వంటి అధికారి
పక్షవాతానికి గురై జీవచ్ఛవంలా బతకడానికి వైఎస్ కుటుంబ అవినీతే కారణం.
ఇటువంటి అవినీతిపరులపై ఐఏఎస్ అధికారులు పోరాడాలి' అని ఈ సందర్భంగా
మోత్కుపల్లి పిలుపునిచ్చారు. అవినీతిపరులు, దోపిడీదారుల నుం చి
రాష్ట్రాన్ని విముక్తం చేయడానికే చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని,
రాష్ట్రంలోని పేద వర్గాలు బాబును ఆశీర్వదించి, అధికారంలోకి తెస్తేనే వారి
జీవితాల్లో నిజమైన మార్పు వస్తుందని అన్నారు.
: 'సమాజంలో పేదరికం, అసమానతలు పోవాలని జ్యోతిరావు
ఫూలే వంటి మహనీయులు ఆశించారు. కానీ, ఒకే కుటుంబం వేల కోట్ల రూపాయలు
దోచుకొంటే పేదరికం ఎలా పోతుంది?' అని టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత మోత్కుపల్లి
నర్సింహులు ప్రశ్నించారు. జ్యోతిరావు ఫూలే జయంతి కార్యక్రమం గురువారం
ఎన్టీఆర్ భవన్లో జరిగింది. 'వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో
ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా మార్చారు. వేల కోట్లు
దోచుకొన్నారు.