March 15, 2013
ప్రతి కార్యకర్తా అభ్యర్థే..!

వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా ఆయన 165వ రోజైన శుక్రవారం ఇరగవరం లో పాదయాత్ర ప్రారంభించే ముందు కొవ్వూరు, ఆచంట నియోజకవర్గ కా ర్యకర్తలతో ముఖాముఖి సంభాషించా రు. ఈ సందర్భంగా కార్యకర్తలు కొం దరు కొత్త సూచనలు చేశారు. రుణమాఫీ హామీ మన పార్టీకి వచ్చే ఎన్నికల్లో కలిసొచ్చే అంశంగా కూడా కార్యకర్తలు చంద్రబాబు ఎదుట చెప్పుకొచ్చారు. వీలైనంత వరకు అభ్యర్థులను ముందే ప్రకటించినట్లయితే ఎన్నికల పోరాటంలో తాము అలుపెరుగకుండా పనిచేస్తామని కూడా ఆయనకు భరోసా ఇచ్చారు.పిల్ల కాంగ్రెస్ వారు ఎందరినో కొన్నారు. అయినా మన పా ర్టీ మాత్రం ఎక్కడా బలహీనం కాలే దు.
నిజమైన కార్యకర్తలతో, నిజాయితీ గా ఉందని చంద్రబాబు చెప్పారు. ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం. మీలో ఇంకా కసిపెరగాలని సూచించారు. మన దగ్గర బోలెడన్ని ఎన్నికల ఆయుధాలు ఉన్నాయి. వీటిని వినియోగించుకోండని పిలుపునిచ్చారు. మనకు అ భ్యర్థుల కంటే పార్టీయే ముఖ్యమన్నా రు. ఇప్పటికే కేసుల్లో ఇరుక్కుపోయిన పిల్ల కాంగ్రెస్ నేత చరిత్రలో రాజకీయాల జోలికి రానంతగా తెలుగుదే శం కుటుంబసభ్యులు నిత్యం కష్టపడి పార్టీని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశా రు. జగన్ బెయిల్ కోసమే అవిశ్వాస తీర్మానం పెట్టారని గుర్తు చేశారు.
'నే ను నిప్పులా ఉన్నాను.. నిజం నిప్పులాంటిది.. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే' అని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విబేధాలకు తావివ్వకుండా సమష్టిగా పోరాడండి, పార్టీని గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు. ఆ చంట నియోజకవర్గంలోను, కొవ్వూరు నియోజకవర్గంలోనూ అప్పుడు, ఇ ప్పుడు కూడా బలమైన నాయకత్వం ఉంది. ఇది కలిసొస్తే ఈ నియోజకవర్గాల్లో మనకు తిరుగుండదన్నారు.
Posted by
arjun
at
10:03 PM