June 26, 2013
సేవా భావంతో ప్రభుత్వం ముందుకు వచ్చుంటే స్వాగతించేవారం

బుధవారం డెహ్రాడూన్ విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. చార్ధామ్ యాత్రికులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదట పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాట్లు చేసి ఉంటే తాము ప్రత్యేక విమానం ఏర్పాటు చేసే అవసరమే వచ్చేది కాదన్నారు. తమకు వనరులు లేక పోయినా యాత్రికులను ఆదుకునేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశామన్నారు.
విహెచ్ది అత్యుత్సాహం ః
టీడీపీ నేత టీడీ జనార్ధనరావు కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు తమ ఎంపీల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించారని తెలుగుదేశం నేత టీడీ. జనార్దనరావు అన్నారు. ఈ ఉత్సాహాన్ని సోనియా, ప్రధాని మన్మోహన్, సీఎం కిరణ్కుమార్రెడ్డిల వద్ద ప్రదర్శించి ఉంటే బాధితులకు సత్వరమే న్యాయం జరిగేదోమోనని ఎద్దేవా చేశారు.
Posted by
arjun
at
9:34 PM