June 22, 2013
ములాఖత్ ముప్పేనా?
ఇప్పటివరకూ టీడీపీ-కాంగ్రెస్
మ్యాచ్ఫిక్సింగ్ చేసుకుంటున్నాయంటూ విమర్శిస్తోన్న వైఎస్సార్
కాంగ్రెస్-టీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు కుడితిలో పడ్డాయి. శాసనసభ చివరి
రోజు సందర్భంగా టీఆర్ఎస్-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు బహిరంగంగా
అందరిముందూ చేసుకున్న స్లిప్పుల మార్పిడి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర
వ్యాప్తంగా రచ్చ అవుతోంది. ఇద్దరూ ఒకరినొకరు సహకరించుకున్న వైనాన్ని
సద్వినియోగం చేసుకునేం దుకు ప్రధాన ప్రతిపక్షమయిన తెలుగుదేశం పార్టీ
రంగంలోకి దిగింది. శాసనసభ లాబీల వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్-టీఆర్ఎస్
మార్చుకున్న స్లిప్పుల వ్యవహారం ఆ రెండు పార్టీలనూ ఇరుకున పెట్టేలా
మారింది. దీనిని తెలు గుదేశం పార్టీ బ్రహ్మాస్త్రం చేసుకుని, అటు
సీమాంధ్ర-ఇటు తెలంగాణలోనూ ఆరెండు పార్టీల మధ్య జరుగుతున్న ఒప్పందాలను
బహిర్గం చేసేందుకు సిద్ధమవుతోంది.
టీఆర్ఎస్ యువనేత, కేసీఆర్ తనయుడయిన కేటీఆర్ను లక్ష్యంగా చేసుకుని టీడీపీ శాసనసభ, బయట అస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. సీమాంధ్ర కాంట్రాక్టర్లు, బిల్డర్లతో కేటీఆర్ చేశారని వస్తున్న సెటిల్మెంట్ ఆరోపణ లను టీడీపీ ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. ఆ సందర్భంగా పొట్టచేత పట్టుకుని వచ్చిన బుడ్డిపేట బుల్లొడి కుటుం బానికి ఇన్ని కోట్ల ఆస్తులెక్కడివని, తెలంగాణను అడు ్డపెట్టుకుని, త్యాగధునుల ఆత్మబలిదానాలను అడు ్డపెట్టుకుని రానున్న ఎన్నికల్లో వందసీట్లు-లక్షకోట్ల లక్ష్యంతో కేసీఆర్ కుటుంబం ప్రజలను మోసం చేస్తోం దంటూ మోత్కుపల్లి, రేవంత్రెడ్డి విరుచుకుపడ్డారు. దీనితో ఇరుకున పడిన టీఆర్ఎస్ చంద్రబాబు ఆస్తులపై ఎదురుదాడి చేసింది.ఆ సందర్భంగా లాబీల్లో జరిగిన ఒక సంఘటన వైఎస్సార్ కాంగ్రెస్-టీఆర్ఎస్ను ప్రజల ముందు ముద్దా యిలా నిలబెట్టేలా చేసింది. టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్కు వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష సిబ్బంది ఒకరు ఆయన చే తికి చంద్రబాబునాయుడుపై ఏమి మాట్లాడాలన్న దానికి సంబంధించి ఒక పేపర్ ఇచ్చారు.
ఆ అంశాలపై మీడియా పాయింట్లో మాట్లాడా లని దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత కేటీఆర్ను కూడా కలసి, ఏమి మాట్లాడారో చెప్పారు. తర్వాత మీడియా పాయింట్కు వెళ్లిన ఈటెల అదే పేపర్లో బాబుకు సంబంధించిన ఆరోపణలన్నీ ఏకరువు పెట్టారు. టీడీపీ ఎమ్మెల్యే టీవీ రామారావు, సుమన్రాథోడ్ తప్పు చేసినా ఎందుకు సస్పెండ్ చేయలేదని, శోభా హైమావతి దొంగ సర్టిఫికెట్తో ఎమ్మెల్యే అయినా ఎందుకు చర్యలు తీసు కోలేదని ప్రశ్నించారు. ఇవన్నీ వైఎస్సార్ సీపీ శాసనస భాపక్షం నుంచి వచ్చినవే కావడం గమనార్హం. ఆ తర్వాత కేటీఆర్ కూడా తనపై వచ్చిన ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని, ఆ ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఐఎంజీకు సంబంధించి బాబుపై ఉన్న ఆరోపణలను ధర్మాన వైఎస్సార్ కాంగ్రెస్కు ఇస్తే, సభలో వైకాపా దానిపైనే మాట్లాడిందంటూ టీడీపీ నేతలు మీడియా సమావేశంలో ఆరోపించారు. తాజా వ్యవహారం అటు టీఆర్ఎస్, ఇటు వైకాపాకు ఇరకాటంగా మారనుంది.
రెండు పార్టీలు ఒకరికొకరు సహకరించు కుంటున్న వైనాన్ని రాష్ర్ట వ్యాప్తంగా ప్రచారం చేయాలని టీడీపీ నిర్ణయించింది. అందులో భాగంగా శనివారం టీడీపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటుచేసి.. రెండు పార్టీలు స్లిప్పులు మార్చుకున్న వైనాన్ని వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం ద్వారా రెండు పార్టీలను ఆత్మరక్షణలో పడవేయడంతో పాటు, తెలంగాణలో టీఆర్ఎస్ను, సీమాంధ్రలో వైకాపాను ఒకేసారి దెబ్బతీయాలన్న వ్యూహంతో వెళుతున్నాయి. తెలంగాణను వ్యతిరేకిస్తున్న వైకాపాతో టీఆర్ఎస్ ఎన్నికల పొత్తు పెట్టుకోబోతోందనడానికి ఇదే నిదర్శనమని తెలంగాణ ప్రాంతంలో ప్రచారం చేయనుంది. రాష్ట్రాన్ని విభ జించాలని కోరుతూ, సీమాంధ్రులను బెదిరిస్తోన్న టీఆర్ఎస్తో వైకాపా ఎన్ని కల పొత్తు పెట్టుకోబోతోందని, అందులో భాగంగానే శాసనసభలో ఒకరికొకరు సహకరించుకున్నారని ప్రచారం చేయనుంది.
ఈ వ్యవహారం రెండు పార్టీలనూ ఆత్మరక్షణలో పడవేశాయని ఆయా పార్టీ నేతల వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్ నేతలు ఈ పరిణా మాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో తెలివి ఉన్న నాయకులు ఎంతో మంది ఉండగా, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి మేధోసాయం తీసుకోవలసిన అవస రం ఏమిటని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణలో ప్రత్యర్ధులు బలపడుతున్న సమయంలో పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలన్న దానిపై కేసీఆర్ సీరియస్గా దృష్టి సారిస్తున్న సమయంలో.. తెలంగాణకు బద్ధ వ్యతిరే కిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్తో సంబం ధాలేమిటని, ఈ విషయం ప్రజల్లోకి వెళితే పార్టీ ఎలా తిప్పికొట్టాలని టీఆర్ఎస్ నేతలు మల్లగుల్లాలు పడుతు న్నారు.అటు వైఎస్సార్ కాంగ్రెస్ నేతల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది.
పరకాల ఎన్నికల్లో తమ పార్టీని ఓడించి, సిట్టింగ్ ఎమ్మెల్యే కొండా సురేఖ ఓట మికి కారణమయిన టీఆర్ఎస్తో సంబంధాలున్నాయని, రానున్న ఎన్నికల్లో రెండు పార్టీలూ కలసి పోటీచేస్తాయన్న టీడీపీ ప్రచారాన్ని ప్రజలు నమ్మితే.. పార్టీ పరువు, భవిష్యత్తు ఏమి కావాలని వైకాపా సీనియర్లు ఆందోళన చెందు తున్నారు. జగన్ రైలుపై రాళ్లు వేసిన టీఆర్ఎస్తో సంబంధాలున్నాయని సీమాంధ్ర వైకాపా కార్యకర్తలు భావిస్తే, అది పార్టీకే ప్రమాదమని వ్యాఖ్యా నిస్తున్నారు. ‘ఒకవైపు జగన్ జైల్లో ఉన్నారు. మరోవైపు పాపం విజయమ్మ నానా కష్టాలు పడి పార్టీ కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బతినకుండా శ్రమిస్తున్నారు. ఇంకోవైపు షర్మిలమ్మ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా, ఎండా వానా లెక్కచేయకుండా పాదయాత్ర చేస్తుంటే వీళ్లు సొంత తెలివితేటలతో పార్టీని ఈవిధంగా రోడ్డునపడేస్తున్నారు. ఇక పార్టీని బాగుచేసేదెవరు? అయినా ఇలాంటి విషయాలపై పార్టీలో ముందుగా చర్చించకుండా, సొంత నిర్ణయాలు తీసుకుంటూ పోతే ఇక పార్టీని కాపాడేదెవర’ని ఓ సీనియర్ నేత వాపోయారు.
మీదే రాజకీయ అక్రమ సంబంధం: కోడెల
శాసనసభలో వైఎస్సార్ సీపీ- టీఆర్ఎస్ తమ పార్టీపై ఆరోపణలు చేసేందుకు ఒకరికొకరు స్లిప్పులు పంచుకున్న వైనం రాజకీయ అక్రమ సంబంధానికి పరాకాష్ఠ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ పైకి ఒకరిపై మరొకరు విమర్శించుకున్న ఈ రెండు పార్టీల నిజస్వరూపం బయటపడిందని, దీనిని ప్రజలు గమనించి నిలదీయాలని పిలుపునిచ్చారు. కొత్తగా కళ్లు తెరిచిన వైఎస్సార్ నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకునే దుస్థితికి టీఆర్ఎస్ దిగజారిందంటే ఆ పార్టీ దయనీయం ఆ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చన్నారు.కాంగ్రెస్-టీడీపీ
మ్యాచ్ఫిక్సింగ్ చేసుకుంటున్నాయంటున్న టీఆర్ఎస్-వైఎస్సార్ కాంగ్రెస్
రాజకీయ అక్రమ సంబంధాన్ని ప్రజలు గమనించాలన్నారు. ఆ రెండు పార్టీలకు తమను
విమర్శించే నైతిక హక్కు, అర్హత లేదని కోడెల స్పష్టం చేశారు.a
టీఆర్ఎస్ యువనేత, కేసీఆర్ తనయుడయిన కేటీఆర్ను లక్ష్యంగా చేసుకుని టీడీపీ శాసనసభ, బయట అస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. సీమాంధ్ర కాంట్రాక్టర్లు, బిల్డర్లతో కేటీఆర్ చేశారని వస్తున్న సెటిల్మెంట్ ఆరోపణ లను టీడీపీ ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. ఆ సందర్భంగా పొట్టచేత పట్టుకుని వచ్చిన బుడ్డిపేట బుల్లొడి కుటుం బానికి ఇన్ని కోట్ల ఆస్తులెక్కడివని, తెలంగాణను అడు ్డపెట్టుకుని, త్యాగధునుల ఆత్మబలిదానాలను అడు ్డపెట్టుకుని రానున్న ఎన్నికల్లో వందసీట్లు-లక్షకోట్ల లక్ష్యంతో కేసీఆర్ కుటుంబం ప్రజలను మోసం చేస్తోం దంటూ మోత్కుపల్లి, రేవంత్రెడ్డి విరుచుకుపడ్డారు. దీనితో ఇరుకున పడిన టీఆర్ఎస్ చంద్రబాబు ఆస్తులపై ఎదురుదాడి చేసింది.ఆ సందర్భంగా లాబీల్లో జరిగిన ఒక సంఘటన వైఎస్సార్ కాంగ్రెస్-టీఆర్ఎస్ను ప్రజల ముందు ముద్దా యిలా నిలబెట్టేలా చేసింది. టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్కు వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష సిబ్బంది ఒకరు ఆయన చే తికి చంద్రబాబునాయుడుపై ఏమి మాట్లాడాలన్న దానికి సంబంధించి ఒక పేపర్ ఇచ్చారు.
ఆ అంశాలపై మీడియా పాయింట్లో మాట్లాడా లని దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత కేటీఆర్ను కూడా కలసి, ఏమి మాట్లాడారో చెప్పారు. తర్వాత మీడియా పాయింట్కు వెళ్లిన ఈటెల అదే పేపర్లో బాబుకు సంబంధించిన ఆరోపణలన్నీ ఏకరువు పెట్టారు. టీడీపీ ఎమ్మెల్యే టీవీ రామారావు, సుమన్రాథోడ్ తప్పు చేసినా ఎందుకు సస్పెండ్ చేయలేదని, శోభా హైమావతి దొంగ సర్టిఫికెట్తో ఎమ్మెల్యే అయినా ఎందుకు చర్యలు తీసు కోలేదని ప్రశ్నించారు. ఇవన్నీ వైఎస్సార్ సీపీ శాసనస భాపక్షం నుంచి వచ్చినవే కావడం గమనార్హం. ఆ తర్వాత కేటీఆర్ కూడా తనపై వచ్చిన ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని, ఆ ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఐఎంజీకు సంబంధించి బాబుపై ఉన్న ఆరోపణలను ధర్మాన వైఎస్సార్ కాంగ్రెస్కు ఇస్తే, సభలో వైకాపా దానిపైనే మాట్లాడిందంటూ టీడీపీ నేతలు మీడియా సమావేశంలో ఆరోపించారు. తాజా వ్యవహారం అటు టీఆర్ఎస్, ఇటు వైకాపాకు ఇరకాటంగా మారనుంది.
రెండు పార్టీలు ఒకరికొకరు సహకరించు కుంటున్న వైనాన్ని రాష్ర్ట వ్యాప్తంగా ప్రచారం చేయాలని టీడీపీ నిర్ణయించింది. అందులో భాగంగా శనివారం టీడీపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటుచేసి.. రెండు పార్టీలు స్లిప్పులు మార్చుకున్న వైనాన్ని వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం ద్వారా రెండు పార్టీలను ఆత్మరక్షణలో పడవేయడంతో పాటు, తెలంగాణలో టీఆర్ఎస్ను, సీమాంధ్రలో వైకాపాను ఒకేసారి దెబ్బతీయాలన్న వ్యూహంతో వెళుతున్నాయి. తెలంగాణను వ్యతిరేకిస్తున్న వైకాపాతో టీఆర్ఎస్ ఎన్నికల పొత్తు పెట్టుకోబోతోందనడానికి ఇదే నిదర్శనమని తెలంగాణ ప్రాంతంలో ప్రచారం చేయనుంది. రాష్ట్రాన్ని విభ జించాలని కోరుతూ, సీమాంధ్రులను బెదిరిస్తోన్న టీఆర్ఎస్తో వైకాపా ఎన్ని కల పొత్తు పెట్టుకోబోతోందని, అందులో భాగంగానే శాసనసభలో ఒకరికొకరు సహకరించుకున్నారని ప్రచారం చేయనుంది.
ఈ వ్యవహారం రెండు పార్టీలనూ ఆత్మరక్షణలో పడవేశాయని ఆయా పార్టీ నేతల వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్ నేతలు ఈ పరిణా మాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో తెలివి ఉన్న నాయకులు ఎంతో మంది ఉండగా, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి మేధోసాయం తీసుకోవలసిన అవస రం ఏమిటని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణలో ప్రత్యర్ధులు బలపడుతున్న సమయంలో పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలన్న దానిపై కేసీఆర్ సీరియస్గా దృష్టి సారిస్తున్న సమయంలో.. తెలంగాణకు బద్ధ వ్యతిరే కిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్తో సంబం ధాలేమిటని, ఈ విషయం ప్రజల్లోకి వెళితే పార్టీ ఎలా తిప్పికొట్టాలని టీఆర్ఎస్ నేతలు మల్లగుల్లాలు పడుతు న్నారు.అటు వైఎస్సార్ కాంగ్రెస్ నేతల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది.
పరకాల ఎన్నికల్లో తమ పార్టీని ఓడించి, సిట్టింగ్ ఎమ్మెల్యే కొండా సురేఖ ఓట మికి కారణమయిన టీఆర్ఎస్తో సంబంధాలున్నాయని, రానున్న ఎన్నికల్లో రెండు పార్టీలూ కలసి పోటీచేస్తాయన్న టీడీపీ ప్రచారాన్ని ప్రజలు నమ్మితే.. పార్టీ పరువు, భవిష్యత్తు ఏమి కావాలని వైకాపా సీనియర్లు ఆందోళన చెందు తున్నారు. జగన్ రైలుపై రాళ్లు వేసిన టీఆర్ఎస్తో సంబంధాలున్నాయని సీమాంధ్ర వైకాపా కార్యకర్తలు భావిస్తే, అది పార్టీకే ప్రమాదమని వ్యాఖ్యా నిస్తున్నారు. ‘ఒకవైపు జగన్ జైల్లో ఉన్నారు. మరోవైపు పాపం విజయమ్మ నానా కష్టాలు పడి పార్టీ కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బతినకుండా శ్రమిస్తున్నారు. ఇంకోవైపు షర్మిలమ్మ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా, ఎండా వానా లెక్కచేయకుండా పాదయాత్ర చేస్తుంటే వీళ్లు సొంత తెలివితేటలతో పార్టీని ఈవిధంగా రోడ్డునపడేస్తున్నారు. ఇక పార్టీని బాగుచేసేదెవరు? అయినా ఇలాంటి విషయాలపై పార్టీలో ముందుగా చర్చించకుండా, సొంత నిర్ణయాలు తీసుకుంటూ పోతే ఇక పార్టీని కాపాడేదెవర’ని ఓ సీనియర్ నేత వాపోయారు.
మీదే రాజకీయ అక్రమ సంబంధం: కోడెల
శాసనసభలో వైఎస్సార్ సీపీ- టీఆర్ఎస్ తమ పార్టీపై ఆరోపణలు చేసేందుకు ఒకరికొకరు స్లిప్పులు పంచుకున్న వైనం రాజకీయ అక్రమ సంబంధానికి పరాకాష్ఠ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ పైకి ఒకరిపై మరొకరు విమర్శించుకున్న ఈ రెండు పార్టీల నిజస్వరూపం బయటపడిందని, దీనిని ప్రజలు గమనించి నిలదీయాలని పిలుపునిచ్చారు. కొత్తగా కళ్లు తెరిచిన వైఎస్సార్ నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకునే దుస్థితికి టీఆర్ఎస్ దిగజారిందంటే ఆ పార్టీ దయనీయం ఆ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చన్నారు.కాంగ్రెస్-
Posted by
arjun
at
9:58 PM