తెలుగుజాతి యుగపురుషుడు ఎన్టీఆరేనని తెలుగుదేశం పార్టీ
అధ్యక్షుడు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. హిమాయత్నగర్లోని
గండిపేట తెలుగు విజయంలో సోమవారం ప్రారంభమైన మహానాడులో ఆయన మాట్లాడుతూ
తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన నేత ఎన్టీఆర్ అని కొనియాడారు.
తమ హయాంలో మిగులు విద్యుత్ ఉండేదని, ఇప్పుడు రాష్ట్రం తీవ్ర విద్యుత్
సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ సమస్యలతో పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. వ్యవసాయం దెబ్బతిందని
చంద్రబాబు పేర్కొన్నారు. 'అమ్మ హస్తం' మొండి హస్తం అన్న వ్యాఖ్యలు ఇప్పుడు
నిజమయ్యాయన్నారు.పాదయాత్రలో కార్యకర్తలు, ప్రజలు నిండు మనసుతో సహకరించారని
ఆయన చెప్పారు. టిడిపి అధికారంలోకి వస్తే రైతుల రుణమాఫీపైనే తొలి సంతకం
అన్నారు.