April 26, 2013
విశాఖరూపురేఖలు మారుస్తా

వీలైనంత త్వరలో అప్పన్న భూ సమస్య పరిష్కారానికి కృషి చేసి స్థానికంగా ఉన్న ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు. మండల కేంద్రంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామని, రైతాంగాన్ని ఆదుకుంటామని బాబు హామీ ఇచ్చారు. అలాగే ప్రతీ మండలంలోనూ డిగ్రీ, పాలిటెక్నికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగాలు అమ్ముకునే పరిస్థితిని తప్పించి అర్హత గల ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు బండారు సత్యనారాయణమూర్తి, మహిళా నేతలు నన్నపనేని రాజకుమారి, శోభ హైమవతి, జిల్లా అధ్యక్షుడు రత్నాకర్ పాల్గొన్నారు.
Posted by
arjun
at
7:46 AM