April 23, 2013
రాష్ట్రాన్ని చక్కదిద్దగలిగేది చంద్రబాబే

కాంగ్రెస్ వైఫల్యాలు వైయస్ కుటుంబం అవినీతి ప్రజలకు వివరిస్తూ చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్రకు అనూహ్య స్పందన లభించిందన్నా రు. బాబు పాదయాత్ర ప్రజల్లో చైతన్యం కలిగించిందన్నారు. రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధిస్తుందన్నారు. క్రమశిక్షణ కు, నిజాయితీకి మారుపేరైన టీడీపీకి ప్రజలు పట్టం కట్టడం తథ్యమన్నారు. పార్టీలో చిన్న చిన్న విబేధాలుంటే సర్దుబాటు చేసుకుని ప్రజల్లోకి వెళతామన్నారు. డబ్బు కోసం ఏనాడు తాను ఆశించలేదని తరతరాలుగా తమ వంశం నీతిగానే రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేసిందన్నారు. ఈనెల 27వ తేదీతో చంద్రబాబు నాయుడి వస్తున్నా మీకోసం పాదయాత్ర ముగుస్తుందని ఈ సందర్భం గా విశాఖలో ఏర్పాటు చేసిన సభకు కార్యకర్తలు తమ సొంత ఖర్చులతో వెళ్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ కో ఆర్డినేటర్ మండవ లక్ష్మణరావు, పోలవరం నియోజకవర్గ నాయకులు మొడియం శ్రీనివాసరావు, జయవరపు శ్రీరామమూర్తి, టీడీపీ జిల్లా అధికార ప్రతిని«ధి బొబ్బర రాజ్పాల్కుమార్, జంగారెడ్డిగూడెం పట్టణ, మండల అధ్యక్షులు షేక్ ముస్తఫా, దల్లికృష్ణారెడ్డి, బుట్టాయగూడెం, కా మవరపుకోట, మండల టీడీపీ అధ్యక్షులు మొగపర్తి సోంబాబు, కోనేరు వెంకట సుబ్బారావు, మందలపు కృష్ణారావు, పరిమి రాంబాబు, మద్దిపాటి నాగేశ్వరరావు, నంబూరి రామచంద్రరాజు, పెసరగంటి జయరాజు, తూటికుంట దుర్గారావు, వందనపు హరికృష్ణ, పాతూరి అంబేద్కర్, ధూళిపాళ ప్రభాకరరావు, యర్రమళ్ళ సుబ్బారావు, ఆరుగొల్లు బజారు, మిడతా పెంటయ్య, ముళ్ళపూడి శ్రీనివాసరావు, గంధం అప్పాజీ, పిన్నమనేని మధుసూధనరావు తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
1:23 AM