March 29, 2013
కోతలు.. షాకులే సర్కారు ఘనతలు

బిక్కవోలు, జి.మామిడాడల్లో పదో తరగతి విద్యార్థులు వచ్చి కలిశారు. వాళ్లకు అసలు పరీక్ష వాళ్లు రాసే పదో తరగతి పరీక్ష కాదట. కరెంటు కోతలే వాళ్ల పాలిట అగ్ని పరీక్షగా మారాయి. పరీక్షల సమయంలో గుడ్డి దీపాల కింద చదువుకోవడం ఈ ప్రభుత్వం వాళ్లకు ఇచ్చిన బహుమతి. "లక్షల కోట్ల బడ్జెట్లు పెడుతున్నారు. అయినా, మాకు పైసా పనులు జరగడం లేదు. ఈ డబ్బంతా ఎటుపోతోంది సార్'' అంటూ ఓ యువకుడు వేసిన ప్రశ్న ఎంతో అర్థవంతమైనది. ప్రజలు రక్తం చిందించి కట్టిన సొమ్ములన్నీ కాంగ్రెస్ అవినీతి ఖజానాకే చేరుతున్నాయి.
బిక్కవోలులో రజక సోదరులు కలిశారు. ఆనాటి 'ఆదరణ' లాంటి ఆదరణ కావాలని కోరారు. త్వరలోనే ఆ కల నెరవేరుస్తానని హామీ ఇచ్చి ముందుకు కదిలా!!
Posted by
arjun
at
12:35 AM