March 26, 2013
తెలుగు తమ్ముళ్ల సంబరాలు

ఇం దులో భాగంగా జిల్లా కేంద్రంలో సో మవారం రాత్రి ప్రత్యేక సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ వ్యవస్థాపకు డు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విగ్ర హం వద్ద 2500 కి.మీ పేరుతో విద్యు త్ వెలుగులు ఏర్పాటు చేశారు. అక్క డే కేక్ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పా ర్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు.
అన్ని వర్గాల ప్రజలు అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారని ఆవే దన వ్యక్తం చేశారు. దేవుడా మాకు రక్ష ఎవరంటూ బతుకులీడుస్తున్నారన్నా రు. ఈ పరిస్థితుల్లో వారి సమస్యలను తెలుసుకొని అండగా నేనున్నానని చెప్పి వారిలో ఆత్మస్థైర్యం పెంచాలని 63 ఏళ్ళ వయస్సులో చంద్రబాబు పాదయాత్ర చేపట్టారన్నారు. ఈ పాదయాత్రకు లక్షలాది మంది ప్రజలు అండగా నిలిచి ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ప్రపంచ చరిత్రలోనే చంద్రబాబు పాదయాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. 9 ఏళ్ళ పాటు సీఎంగా ఉంటూ మరో 9 ఏళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్న మహానాయకుడు బాబు అని కొనియాడారు. ఇంతటి మహాయజ్ఞం ఖచ్చితంగా విజయవంతం అవుతుందన్నారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశానికి పట్టం కట్టి చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రిని చేయడం ఖాయమన్నారు. దీంతో రాష్ట్ర ప్రజల తలరాతలు మారనున్నాయని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్చార్జ్ మహాలక్ష్మి శ్రీనివాస్, సీనియర్ నాయకులు బుగ్గయ్య చౌదరి, నెట్టెం వెంకటేష్, నదీం అహ్మద్, నగర అధ్యక్షుడు క్రిష్ణకుమార్, సరిపూటి రమణ, కూచే హరిప్రసాద్, నజీర్, సుబ్బారెడ్డి, మణికంఠ బాబు, సాయిరామయ్య చౌదరి, గుడిపూటీ శీనా, కాకర్ల ఆదినారాయ ణ, అశోక్ నగర్ శీనా, మణికంఠి జయ ప్ప, చెర్లోపల్లి రామక్రిష్ణ, అంకె చంద్ర, నంబూరీ రమణ, రామచంద్ర, పరమేష్, రియాజ్, బాలు, సైఫుద్దీన్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నారాయణస్వామి, భాస్కర్యాదవ్, వెంకటప్ప, లాల్ బాషా, మహిళా నాయకురాలు, రమాదేవి, లక్ష్మిదేవమ్మ పాల్గొన్నారు.
Posted by
arjun
at
6:04 AM