July 30, 2013
మూడో విడతలోనూ టీడీపీదే హవా

జిల్లాలో 407 సర్పంచ్ స్థానాలు గెలుచుకుని టీడీపీ మొదటి స్థానంలో ఉండగా, 247 స్థానాలతో వైసీపీ రెండవ స్థానంలో, 187 స్థానాలతో కాంగ్రెస్ మూడవ స్థానంలో, స్వతంత్రులు 75మంది విజయం సాధించారన్నారు. 31వ తేదీన నిర్వహించనున్న 3వ విడత పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ తన హవా కొనసాగిస్తుందన్నారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, పాదయాత్ర ఫలితంగానే నేడు పంచాయతీ ఎన్ని
కల్లో టీడీపీ ఘన విజయం సాధించిందన్నారు. చంద్రబాబు పాదయాత్ర ముగిసిన నెల రోజుల తరువాత వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల జగనన్న బాణం పేరుతో మరో ప్రజా ప్రస్థానం అంటూ పాదయాత్ర చేస్తోందని, అసలు షర్మిల ఎందుకు పాదయాత్ర చేస్తోందో ప్రజలకు అర్థం కావడం లేదని విమర్శించారు. 2014లో నిర్వహించనున్న ఎన్నికల్లో టీడీపీ అఖండ మెజారిటీతో గెలుపొంది చంద్రబాబు సీఎం కావడం తథ్యమని వారు జోస్యం చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు దొరబాబు, మహదేవ నాయుడు, నాని, కఠారి మోహన్, వై.వి.రాజేశ్వరి, మోహన్ రాజ్, విల్వనాధం తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
1:35 AM