March 21, 2013
జన గోదావరి

చంద్రబాబు 'మీ కోసం వస్తున్నా' 170వ రోజు పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 13 కిలోమీటర్ల మేర సాగింది. ఈసందర్భంగా చంద్రబాబు విద్యుత్ కోతల గురించీ, చార్జీల వడ్డన గురించీ, గ్యాస్ సమస్యల గురించీ ప్రస్తావించారు. కాంగ్రెస్ దొంగల పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయన్నారు. ధరల పెరుగుదలతో పేద, సామాన్య వర్గాలు సతమతమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 'నేను మీ ఇంట్లో పెద్దకొడుకులాంటివాడ్ని. ప్రయోజకుడైన కొడుకు ఎలా కుటుంబాన్ని ఆదుకుంటాడో.. రేపు అధికారంలోకి వచ్చాకా నేనూ ఆ పని చేస్తాను. ఎన్నికల ఒక్క రోజూ నాకివ్వండి.. ఐదేళ్లూ మిమ్మల్ని ఆదుకునేందుకు నేను కష్టపడతాను..' అన్నారు.
Posted by
arjun
at
5:43 AM