March 6, 2013
టీడీపీ వస్తేనే గ్రామాల అభివృద్ధి

బాబు యాత్ర ఉండటంతో విద్యుత్ సరఫరా ఉంచుతున్నారని, ఈ ప్రాంతం దాటాక మళ్ళీ అంధకారమేనని ఒక కార్యకర్త అన్నారు. కొసరాజు బాపయ్యచౌదరి కార్యకర్తలను బాలయ్యకు పరిచయం చేయగా, ఆయన వారిని పేరు పేరునా పలుకరించారు. అందరు కష్టపడి పని చేసి పార్టీని నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు. మినపకాయ తీతకు వచ్చిన కూలీలు పనులకు వెళ్లకుండా చూసేందుకు రావడంతో ఆయన వారితో మా ట్లాడి ఫొటోలు తీయించారు. పశుభొట్లపాలెంకు చెందిన బాలయ్య అభిమాని పాములు ఫొటో దిగేందుకు వచ్చి తాను పెట్టుకున్న నల్లఅద్దాల కళ్ళజోడు తీస్తుండగా.. ఆగు..ఆగు ఎందుకు తీస్తావు ఉంచుకో అని తీసిన జోడును పెట్టించి మరీ ఫొటో దిగారు. కొసరాజు బాపయ్యచౌదరి, జిల్లా ఉపాధ్యక్షుడు జంగం మోహనరావు, జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘ డైరెక్టర్ వి.బి.కె.బి సుబ్బారావు, సొసైటీ అధ్యక్షుడు పి.రవికుమార్, బొప్పన శివప్రసాద్, పిన్నమనేని రాఘవేంద్రరావు, చంద్రాల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
12:34 AM