వ స్తున్న మీ కోసం పాదయాత్ర లో
భాగంగా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం 2 అంశాలపై జిల్లా కలెక్టర్కు
వినతిపత్రాలు పంపించారు. శనివారం కొత్తపల్లికి చేరకున్న బాబుకు బెజ్జం కి మండల వాసులు
తోటపల్లి ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి 5.2 లక్షల నష్ట పరిహారం
ఇప్పించాలని కోరగా స్పందించిన బాబు లేఖ రాశారు. తోటపల్లి రిజర్వాయర్ కారణంగా వరికోలు,
రాంచంద్రాపూర్ రైతులకు ఎకరానికి 2 లక్షల 10 వేలు మాత్రమే నిర్ణయించారని ఈ గ్రామాలకు
15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లారం చర్ల అంకిరెడ్డిపల్లి గ్రామాలకు అబ్దుల్కలాం సు
జల స్రవంతి పథకం కింద తీసుకున్న భూములకు ఎకరానికి 5.20 లక్షలు పరిహా రం ఇచ్చారని రైతులు
పేర్కొన్నారు. అలాగే రామడుగు మండలంలో మోతె గ్రామస్తులు తమ గ్రామం నుంచి 14 కిలోమీటర్ల
ఉన్న కరీంనగర్కు 2 ట్రిప్పులు మాత్రమే బస్సు నడుస్తుందని దీంతో విద్యార్థులు, ప్రజలు
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విన్నవించగా అదనంగా 4 ట్రిప్పులు బస్సు సౌకర్యాన్ని
క ల్పించాలని కోరారు. రెండు వినతి పత్రాలను కలెక్టర్కు పంపించారు.
No comments :
Post a Comment