ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే ఎవరూ భయపడరని, ఢిల్లీలో సామూహిక
అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, అవసరమైతే ఉరిశిక్ష విధించాలని
చంద్రబాబు డిమాండ్ చేశారు. స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్ళు గడిచినా ఆడబిడ్డలు బయటకు వెళ్తే
తిరిగి వచ్చేవరకు నమ్మకం లేకుండా పోతున్నదని, మహిళలకు రక్షణ కొరవడిందని ఆవేదన వ్యక్తంచేశారు.
అత్యాచారం చేసిన వారిని వదిలేసి, శిక్షించాలని ఆందోళన చేసిన వారిపై లాఠీచార్జి చేయడం
అత్యంత దారుణం, అమానుషమని గర్హించారు.
No comments :
Post a Comment