April 15, 2013
ఇదేనా ఆ 'నిర్మల' గ్రామం!

రహదారుల నుంచి నీటి కుంటల దాకా నాడు ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తే.. ఇప్పుడు అవన్నీ అవినీతి కంపు కొడుతున్నాయి. రోడ్ల పక్కన ఆహూతులను ఆహ్లాదపరిచే పచ్చటి మొక్కల జాడ ఎక్కడా కనిపించడం లేదు. బాగున్న ఊరిని బజారులో పెట్టింది ఎవరు? పంచాయతీరాజ్ సంస్థలకు సకాలంలో ఎన్నికలు జరపని పాలకులదే ఈ పాపం. ఆలన చూడాల్సిన పంచాయతీ వ్యవస్థలు లేవు.
చేనేత కాలనీలో తిరుగుతుండగా ఓ నేతన్న ఎదురయ్యాడు. "మా బతుకులు చూడయ్యా ఎలాగయ్యాయో! చినుకు పడితే ఈ ప్రాంతమంతా మునిగిపోతుంది. మా పనీ ఆగిపోతుంది. ఎంత చెప్పినా, ఎన్ని పిటిషన్లు పెట్టినా పట్టించుకున్న వారే లేరు'' అంటూ ఆయన దిగాలు పడ్డారు. ఈ సర్కారు మునిగిపోతే తప్ప మాకీ ముప్ప తప్పదని ఆ పక్కనే ఉన్న ఓ నడివయస్కురాలు శాపనార్థాలు పెట్టింది. అది వట్టిశాపమే కాదు.. పాలకుల పాపం పండిందని చేసే హెచ్చరిక కూడా!
Posted by
arjun
at
11:30 PM