April 9, 2013
యువజనోత్సాహం

సోమవారం జరిగిన యువజన సదస్సులో పలువురు యువతీ, యువకులు ఉత్సాహంగాపాల్గొన్నారు. చంద్రబాబును అనేక ప్రశ్నలు అడిగి అనుమానాలు నివృత్తి చేసుకున్నారు.సోమవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు తుని మండలం తిమ్మాపురంలో జరిగిన యువసదస్సులో పలు ఆసక్తికరమైన అంశాలు చర్చకు వచ్చాయి. అవినీతిపై యువత పోరాడాలన్న చంద్రబాబు పిలుపునకు విద్యార్ధినీ, విద్యార్థులు స్పందించారు. జగన్, వైఎస్ అక్రమాలవల్లే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారు జైలుకెళ్లారని, ఈ పరిస్థితులు పోవాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని చంద్రబాబుతోపాటు.. పలువురు యువతీ, యువకులు ఆకాంక్షించారు.
విద్యుత్సంక్షోభంతో వేల పరిశ్రమలు మూతపడ
టంతోపాటు.. ఇతర రాష్ట్రాలకుతరలిపోతున్నాయని. ఉద్యోగాలు లేవని బోర్డులు పెట్టేశారని యువత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు.
బాబు అడుగులో అడుగువేసి చంద్రబాబు పాదయాత్రలో యువత పాలుపంచుకున్నారు. కొంత మేర నడిచి ఆయనతో అనేక సమస్యలపై చర్చించారు. సదస్సులో అ.భిప్రాయాలు వ్యక్తం చేయడానికి అవకాశంలేని యువతీ, యువకులను పాదయాత్రలో వచ్చి తమ అహాప్రాయాలు చెప్పాలని చంద్రబాబు సూచించారు. దీంతో కొంతమంది యువకులు పాదయాత్రలో చంద్రబాబు వెంట నడిచి సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
Posted by
arjun
at
12:55 AM