April 21, 2013
వర్షాన్ని లెక్కచేయని అభిమానం

ఉదయం 11.15 గంటలకు బోరున వర్షం కురిసింది. గంటకు పైగా వర్షం కురియడంతో బాబు బస చేసిన ప్రాంతమంతా జలమయమైంది. వర్షం పూర్తిగా తగ్గేవరకూ ముఖ్యనేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు వేచి ఉన్నారు. ఇంకొందరు వర్షంలో తడుచుకుంటూనే అక్కడకు చేరుకున్నారు. పన్నెండుగంటల సమయంలో చంద్రబాబునాయుడు బస్సులో నుంచి బయటకు వచ్చారు. శుభాకాంక్షలు అందుకొని అభివాదం చేశారు.
కూలిన టెంట్లు..
చంద్రబాబునాయుడు బస చేసిన ప్రాంతంలో ఈదురుగాలులతో వర్షం కురియడంతో
ఉన్నఫలంగా టెంట్ కూలిపోవడంతో వారంతా పరుగులు తీశారు. సభా ప్రాంగణమంతా తడిసి చిత్తడిచిత్తడిగా మారింది. దీంతో చంద్రబాబు బస్సు వద్దకు చేరుకోవడానికి ప్రజలు, నాయకులు ఇబ్బంది పడ్డారు. జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు రత్నాకర్ ఆధ్వర్యంలో అప్పటికప్పుడు చంద్రబాబు బస చేసిన ప్రాంతంలో ఇసుక వేసి రాకపోకలకు అంతరాయం కలగకుండా చూశారు.
Posted by
arjun
at
6:46 AM